ఆజాద్ షాక్, తెలంగాణ డిమాండుపై మొండిచేయి

Ghulam Nabi Azad
బీజింగ్: తెలంగాణపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నాయకులకు ఆయన షాక్ ఇచ్చారు. శానససభ ఏకగ్రీవ తీర్మానం చేయకుండా తెలంగాణపై నిర్ణయం తీసుకోలేమని ఆయన తేల్చేశారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం తనతో వచ్చిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలతోనే ఏర్పాటయ్యాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఏకాభిప్రాయం కుదరనంత వరకు తెలంగాణ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏకాభిప్రాయం లేకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం కష్టమని ఆయన అన్నారు.

తెలంగాణలో సెంటిమెంటు ఉన్నట్లుగానే సీమాంధ్రలో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్రులు వ్యతిరేకిస్తున్నారని, అందువల్ల తెలంగాణ నాయకుల ఒత్తిడికి లొంగలేమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని శాసనసభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేనంత వరకు తెలంగాణపై కేంద్రం ఏమీ చేయలేదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ పరిష్కారం చూపుతుందని భావిస్తే ఆ పని చేయలేకపోయిందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఆరు ప్రత్యామ్నాయాలను చూపిందని, అవి ఆచరణ సాధ్యం కావని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ పరిష్కార మార్గం చూపకపోవడంతో తెలంగాణపై మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. శాసనసభ తీర్మానం చేయకుండా అంగుళం కూడా ముందడుగు వేయలేమని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+