ఆజాద్ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ నేతలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా గత నాలుగు వందల సంవత్సరాలుగా ఉందని 1956లో ఆంధ్రలో కలసిందని గుర్తు చేశారు. తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని వేసిన కేంద్రం ఇప్పుడు ఆ కమిటీలో తప్పులు వెదకడం ఏమిటని అన్నారు. ఆజాద్ చైనాలో కామెంట్ చేశాడో లేదో పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడతానని చెప్పారు. తెలంగాణతో మిగిలిన ప్రాంతాలకు ఆజాద్ పోలిక పెట్టడం సరికాదన్నారు. కావాలంటే ఆజాద్ చరిత్ర చూడవచ్చని సూచించారు. తెలంగాణ కోసం మళ్లీ విద్యార్థులు ప్రాణత్యాగం చేసుకోవాలా అని ప్రశ్నించారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు అన్నదమ్ముల్లా విడిపోవడం మంచిదని విహెచ్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు సైతం ఆజాద్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆజాద్ ప్రకటన బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రకటన ఉందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం కావాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. విచక్షణాధికారంతో తీర్మానం చేయించాలని డిమాండ్ చేశారు. ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఏఐసిసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చే బాధ్యత కాంగ్రెసు పార్టీదే అన్నారు. 2004లో టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆజాద్కు తెలంగాణ విషయం తెలియదా అని ప్రశ్నించారు. కాగా తెలంగాణకు ఏకాభిప్రాయం కావాలని, తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని, తెలంగాణ తరహాలు సీమాంధ్రలో సైతం సెంటిమెంటు ఉందని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications