బాబు కళ్లు తెలంగాణ వైపు చూడడం లేదు: నాగం

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్లు తెలంగాణవైపు చూడడం లేదని ఆ పార్టీ నుంచి సస్పెండైన శాసనసభ్యుడు నాగం జనార్దనరెడ్డి అన్నారు. రాష్ట్రం మానసికంగా ఎప్పుడో విడిపోయిందని అన్నారు. రాష్ట్రం మూడు ముక్కలయినా కూడా తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ రాష్ర్టం మాత్రం కావాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. దమ్ముంటే సీమాంధ్ర నేతలు స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలు సమర్పించాలని నాగం డిమాండ్ చేశారు.

సీమాంధ్రకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ తెలంగాణవారిని కించపరుస్తున్నారని ఆయన విమర్శించారు. తమను అవమానించిన టిజి వెంకటేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సోనియా, మన్మోహన్ సింగ్ ఫోటోలు పెట్టుకోవడంలో తప్పు లేదని, తెలంగాణ నినాదం వారికి వినిపించాలనేదే అభిమతమని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని లూటీ చేసింది కాక సీమాంధ్ర నాయకులు విజయవాడలో సమావేశం పెట్టుకున్నారని ఆయన అన్నారు. దమ్ముంటే వారు హైదరాబాదులో సమైక్యాంధ్ర సమావేశం పెట్టాలని ఆయన సవాల్ చేశారు. వారు విజయవాడకే పరిమితమయ్యారని, ఇది సంతోషమని ఆయన అన్నారు. సీమాంధ్ర రాష్ట్రానికి విజయవాడ రాజధాని కావాలని వారి ఉద్దేశం కావచ్చునని ఆయన అన్నారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని, సీమాంధ్రలో ఎన్ని రాజధానులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.

తెలుగుదేశం తెలంగాణ నాయకులు చంద్రబాబు కుట్రలో పావులని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. తాము పదవుల కోసం ఉద్యమం చేయడం లేదని, తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని ఆయన శనివారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తమను రెచ్చగొడితే నష్టపోయేది సీమాంధ్ర నాయకులేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+