వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై బ్లాక్ మెయిల్‌కు లొంగకండి: కావూరి లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రజా ప్రతినిధుల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగకూడదని సూచిస్తూ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు సోమవారం పార్టీ అధిష్టానం, కోర్ కమిటీ సభ్యులకు లేఖ రాశారు. తెలంగాణపై కేంద్రం వేసిన శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదించిన 6వ చాప్టర్‌లోని ఆరవ సిఫార్సును అమలు చేయాలని ఆయన కోరారు. కేంద్రం నిర్ణయం దేశ సమగ్రత, సమైక్యత కాపాడేలా నిర్ణయం ఉండాలని సూచించారు. కేంద్రం ఎలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగవద్దని సూచించారు. రాజకీయ స్వార్థంతోనే ప్రత్యేక వాదన తలెత్తుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగానే ఉంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తెలంగాణ నేతలు మొన్న అభివృద్ధి అన్నారు. ఇప్పుడు స్వయం పాలన, సెంటిమెంట్ అంటూ మాటలు చెబుతున్నారని ఆ లేఖలో ఆరోపించారు.

అధిష్టానం ఏ అంశంపైన చర్చకు పిలిచినా వెళ్లేందుకు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులం సిద్ధంగా ఉన్నామని మంత్రి శైలజానాథ్ వేరుగా చెప్పారు. కొందరి బ్లాక్ మెయిల్ కారణంగా రాష్ట్రం ఏర్పడదన్నారు. సమైక్యాంధ్ర ఆవశ్యకత అధిష్టానానికి వివరిస్తామని చెప్పారు. కెసిఆర్ వ్యాఖ్యలు తాను పట్టించుకోనని అన్నారు. అధిష్టానం పిలిస్తే తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఒకే వేదికపై చర్చకు సిద్ధమని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీలోని 6వ ప్రతిపాదన వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ నేతలతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. కెసిఆర్ మాట్లాడే ప్రతి వ్యాఖ్యలకు కామెంట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.

English summary
Parliament Member Kavuri Sambasiva Rao suggested Congress high command that to do not accept Telangana leaders black mail in his letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X