ఆజాద్ కోర్టులో తెలంగాణ పంచాయతీ, మీడియాపై నెపం

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: తెలంగాణ పంచాయతీని కాంగ్రెసు అధిష్టానం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కోర్టులోకి నెట్టింది. మంగళవారం తమను కలిసిన సీమాంధ్ర నేతలతో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, హోం మంత్రి పి. చిదంబరం చెప్పిన మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది. ఇరు ప్రాంతాల పార్టీ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించి, ఏకాభిప్రాయ సాధన భారాన్ని పార్టీ అధిష్టానం ఆజాద్‌పై పెట్టింది. విషయాలన్నీ ఆజాద్‌కు చెప్తానని చిదంబరం సీమాంధ్ర నేతలతో చెప్పారు. ఆజాద్ సంప్రదింపులు జరుపుతారని ప్రధాని మన్మోహన్ సింగ్ సీమాంధ్ర నేతలతో చెప్పారు. తెలంగాణపై తాను చేసిన ప్రకటనపై తెలంగాణ నేతలు ధిక్కారం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆజాద్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆయన ఆరోపించారు.

మధ్యప్రదేశ్, బీహార్ విభజనకు అందరూ అంగీకరించారని, ఆయా రాష్ట్రాలు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు శాసనసభలు కూడా తీర్మానాలు చేశాయని, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్థితి లేదని తాను అన్నానని ఆయన వివరణ ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసిందని, వాటిలో దేన్ని కూడా స్వీకరించే పరిస్థితి లేదని, వాటిలో ఏ ఒక్క ప్రతిపాదనపై కూడా ఏకాభిప్రాయం లేదని తాను అన్నానని ఆయన వివరించారు. అందువల్లనే మళ్లీ సంప్రదింపులు అవసరమవుతున్నాయని ఆయన అన్నారు. సమస్య పరిష్కారం ఎప్పుడవుతుందనేది తాను చెప్పలేనని, మూడు ప్రాంతాల ప్రతినిధులతో మాట్లాడుతామని, అలా మాట్లాడి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చూస్తున్నామని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వల్ల సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని తాను అనలేదని ఆయన అన్నారు.

ఇరు ప్రాంతాల నాయకులకు కూడా తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీరించే హక్కు ఉందని, తెలంగాణపై ఇరు ప్రాంతాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయని, అంత మాత్రాన ఇరు ప్రాంతాల నాయకులు పరస్పర దూషణలకు దిగడం మంచిది కాదని అంటూ ఇరు ప్రాంతాల నాయకులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. పరస్పర దూషణల ద్వారా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించవద్దని ఆయన అన్నారు. తెలంగాణ నేతలు కూడా ఢిల్లీకి వస్తారని, తాను జానారెడ్డితోనూ కేశవరావుతోనూ ఫోన్‌లో మాట్లాడానని ఆయన చెప్పారు.

కాగా, కేంద్ర హోం మంత్రి చిదంబరంపై సీమాంధ్ర నాయకులు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. తమ భేటీలో చిదంబరం మాట్లాడిన తీరుపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమాలు ప్రశాంతంగా చేసుకోండని సూచిస్తూ ఆయన రోడ్లపై వంటావార్పూ చేసుకోండని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో సీమాంధ్ర నాయకులు బాధపడినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+