విశాఖ కోర్టులో రామోజీరావుకు ఎదురుదెబ్బ

లీజు పొడగింపునకు ఆదిత్యవర్మ అంగీకరించకపోవడంతో న్యాయస్థానంలో కేసు వేశారు. రామోజీ తన స్థలాన్ని కబ్జా చేశారంటూ ఆదిత్యవర్మ మరో కేసు వేశారు. నాలుగేళ్లుగా విచారణ కొనసాగుతోంది. ఇటీవల రామోజీ మూడు మధ్యంతర పిటిషన్లు వేశారు. కేసుకు సంబంధించి ఆదిత్యవర్మ ఇచ్చిన రాతపూర్వక వివరణపై అభ్యంతరాలను తెలియజేస్తామని ఒకటి, ప్రభుత్వం చేస్తున్న వాదనలో (రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయింపు- పరిహారానికి సంబంధించి) అవాస్తవాలు ఉన్నాయని, వీటిపై వివరణ ఇస్తామని, ఆదిత్యవర్మతో కుదుర్చుకున్న లీజు ఒప్పంద పత్రాలు బ్యాంకులో ఉన్నందున అవి వచ్చేవరకు కేసు విచారణ నిలుపు చేయాలని కోరుతూ ఇంకొకటి దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదప్రతివాదనలు జరిగాయి.
మూడో పిటిషన్కు సంబంధించి - లీజు ఒప్పంద పత్రాలు హైదరాబాద్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సైఫాబాద్ బ్రాంచ్లో తాకట్టులో ఉన్నట్లు రామోజీ న్యాయవాది కోర్టుకి చెప్పారు. అవి వచ్చేవరకు విచారణ నిలుపు చేయాలని కోరారు. అయితే ఆదిత్యవర్మ దగ్గర మరో ఒప్పందపత్రం ఉన్నందున కేసు విచారణ కొనసాగించాలని న్యాయమూర్తి వి.వి.శేషుబాబు ఆదేశించారు. సమగ్ర విచారణ అనంతరం మొత్తం మూడు పిటిషన్లనూ కొట్టివేశారు. తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేశారు. వర్మ తరఫున సీనియర్ న్యాయవాది వి.వి.రవిప్రసాద్ కోర్టుకు హాజరయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications