హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పురంధేశ్వరిపై భగ్గుమన్న తెలంగణ నాయకులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari
హైదరాబాద్: మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పురందేశ్వరి పై తెలంగాణ నేతలు భగ్గుమన్నారు. తెలంగాణకు దక్కాల్సిన గిరిజన యూనివర్సిటీని అధికారబలాన్ని ఉపయోగించి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖకు తరలించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, ప్రొఫెసర్ లక్ష్మణ్ ఆరోపించారు. భద్రాచలం నక్సల్స్ ప్రభావిత ప్రాంతమనే సాకుతో వర్సిటీని తరలించే ప్రయత్నాలకు స్వస్తి పలకాలని, లేదంటే ఉద్యమం తప్పదని వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో హెచ్చరించారు.

రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చర్య పుండుమీద కారం చల్లడమేనని ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. 6 లక్షల మంది గిరిజనులుండే భద్రాచలంలోనే యూనివర్శిటి ఏర్పాటుచేయాలని నాలుగేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నామన్నారు. భద్రాచలంలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖని కోరుతున్నట్టు తెలిపారు.

English summary
Telangana leaders expressed anguish at Union Minister Purandeswari on Tribal university issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X