కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మూడినట్లే?

లోకాయుక్త జస్టిస్ సంతోష్హెగ్డే కోరితే తప్ప ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కల్పించుకోబోనని భరద్వాజ్ స్పష్టం చేశారు. ''ఆయన్ను ప్రభావితం చేయాలనుకున్న లేదా ఫోన్ ట్యాపింగ్కు ప్రయత్నించిన వారు బాధ్యతాయుతమైన వ్యక్తులు. టెలిఫోన్ ట్యాపింగ్కు మీరు, నేను పాల్పడలేదు. కాబట్టి ఆ వ్యవహారంలో నాకెలాంటి పాత్ర లేదు'' అని భరద్వాజ్ చెప్పారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్పై విచారణకు ఆదేశించలేదని ప్రభుత్వం తెలిపింది.
కాగా, తాను పదవి నుంచి వైదొలగనని, సోమవారం రాష్ట్రానికి రాగానే విలేకర్ల సమావేశం ఏర్పాటు చేస్తానని యడ్యూరప్ప మారిషస్ నుంచి ఓ ఛానల్కు తెలిపారు. నివేదికలోని అంశాలను బహిర్గతం చేస్తున్న లోకాయుక్త జస్టిస్ సంతోష్హెగ్డేపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరనున్నట్లు చెప్పారు. గనుల తవ్వకాలు, వాటికి అనుమతులు ఇచ్చే విషయంలో తానెలాంటి తప్పు చేయలేదని సమర్థించుకున్నారు. గనుల శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని లోకాయుక్త జస్టిస్ సంతోష్హెగ్డే స్పష్టం చేశారు. ఆదివారం బెంగళూరులో ఓ ప్రైవేటు వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications