జగన్ ఆస్తులపై విచారణ ఎందుకు చేయొద్దు: హైకోర్టు

కాగా మంత్రి శంకర్ రావు, తెలుగుదేశం పార్టీ నేతలు రాజశేఖర రెడ్డి, ఎర్రన్నాయుడు లేఖలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు పదిహేను రోజుల క్రితం సిబిఐ ప్రాథమిక దర్యాఫ్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రాథమిక దర్యాఫ్తులో అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేలితే పూర్తి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. పద్నాలుగు రోజుల పాటు ఐజి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో 23 కంపెనీలను సిబిఐ ప్రశ్నించింది. పెట్టుబడులు ఎలా వచ్చాయి? జగన్ కంపెనీలలోనే పెట్టుబడులు ఎందుకు పెట్టారు? పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు ఆ స్థోమత ఉందా? కంపెనీలు నిజమైనవేనా? తదితర అంశాలపై సిబిఐ పద్నాలుగు రోజుల పాటు అహోరాత్రులు శ్రమించి ప్రాథమిక నివేదికను తయారు చేసింది. మంగళవారం హైకోర్టుకు తమ నివేదికను సమర్పించింది.












Click it and Unblock the Notifications