వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్ప షాక్, కర్ణాటక బిజెఎల్‌పి వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన బిజెపి కేంద్ర నాయకత్వానికి షాక్ ఇచ్చారు. ఆయన తన రాజీనామా విషయంలో యు - టర్న్ తీసుకున్నారు. తన మాటగా కాకుండా ఇప్పుడు ఆయన కొత్త వ్యూహాన్ని అనుసరించారు. తన వర్గాన్ని కేంద్ర నాయకత్వం మీదికి ఉసిగొల్పారు. ఈ నెల 31వ తేదీన గవర్నర్‌కు యడ్యూరప్ప రాజీనామా లేఖను సమర్పిస్తారని, మార్పు సాఫీగా సాగిపోతుందని భావించిన బిజెపి కేంద్ర నాయకత్వానికి దిమ్మ తిరిగే పరిణామం చోటు చేసుకుంది. దీంతో కొత్త నేత ఎంపిక కోసం శుక్రవారం ఉదయం జరగాల్సిన బిజెపి శాసనసభా పక్షం (బిజెఎల్‌పి) సమావేశం తొలుత సాయంత్రానికి వాయిదా పడింది. సాయంత్రం ఐదు గంటలకు జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడింది.

బిజెఎల్‌పి సమావేశం ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు యడ్యూరప్ప వర్గానికి చెందిన దాదాపు 50 మంది శాసనసభ్యులు, 12 మంది పార్లమెంటు సభ్యులు కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి పెంచారు. లోకాయుక్త నివేదికపై ఆధారపడి యడ్యూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడం సరి కాదని వాదించారు. యడ్యూరప్పను తొలగించడం వల్ల పార్టీ దెబ్బ తింటుందని వారు చెప్పారు. ఏడాది పాటు పోరాటం చేస్తే తప్ప 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఎ. రాజాను అరెస్టు చేయలేదని, యడ్యూరప్ప విషయంలో ముందే చర్యలు తీసుకోవడం సరి కాదని వారు వాదిస్తున్నారు.

కాగా, పార్టీ కేంద్ర నాయకత్వం ప్రతినిధులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ బెంగళూర్‌కు చేరుకున్నారు. అరుణ్ జైట్లీని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప, మంత్రులు అశోక్, జగదీషెట్టర్ తదితరులు కలుసుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో యడ్యూరప్ప వర్గానికి చెందిన శాసనసభ్యుల సమావేశం కూడా వాయిదా పడింది.

English summary
The BJP now faces a unique problem - many of its state leaders believe BS Yeddyurappa should stay on as the head of the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X