హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నన్ను విచారించండి: లోకాయుక్తకు శంకరరావు లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: తనపై, తన కుటుంబంపై లోకాయుక్త విచారణ చేయాలని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు సోమవారం ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తకు లేఖ రాశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన లోకాయుక్తకు రాసిన లేఖను చూపించారు. ఇటీవల తనపై కొందరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆ ఆరోపణల నిజం నిగ్గు తేలడానికి తనపై, తన కుటుంబంపై విచారణ జరిపించాలని లోకాయుక్తకు లేఖ రాసినట్టు తెలిపారు. తనపై ఎలాంటి ఆరోపణలు ఉన్నా విచారణ జరిపించుకోవచ్చునని స్పష్టం చేశారు. గనులు, భూగర్భ, భూముల కేటాయింపులపై తెలుగుదేశం పార్టీ హయాం నుండి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే డిజిపి కార్యాలయంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం, కాంగ్రెసు ప్రభుత్వ హయాంలలో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన భూములపై పూర్తిగా విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి రాష్ట్ర జౌళి శాఖకు రావాల్సిన నిధులు తేవడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. పనబాకపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

English summary
Minister Shankar Rao wrote a letter to Lokayukta today that to enquiry him on allegations which were came.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X