చిరంజీవికి మహిళల నుండి మరో చేదు అనుభవం

Chiranjeevi
తిరుపతి: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి తన సొంత నియోజకవర్గం తిరుపతిలో మరోసారి చేదు అనుభవం ఎదురయింది. తన నియోజకవర్గ పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం హైదరాబాదు నుండి ఆయన తిరుపతి చేరుకున్నారు. ఉదయం తిరుపతి యాదవ కాలనీలో ఆయన పర్యటిస్తున్న సమయంలో పలువురు మహిళలు, తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు చిరంజీవిని అడ్డుకున్నారు. చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరంజీవి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఆ వారు ఆయనని నిలదీశారు.

ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని ఓటు వేసి గెలిపిస్తే అసలు అందుబాటులో ఉండటం లేదని ప్రశ్నించారు. దీంతో అవాక్కవడం చిరంజీవి వంతయింది. చిరంజీవిని అడ్డుకోవడంపై ఆగ్రహం చెందిన ఆయన అభిమానులు మహిళలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చిరు అభిమానులకు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలుగజేసుకొని తెలుగు మహిళా కార్యకర్తలను, మహిళలను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ చిరంజీని తిరుపతి పర్యటనలో మహిళలు అడ్డుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+