వాదనల మీద వైయస్ జగన్ లాయరుపై హైకోర్టు ఆగ్రహం

High court
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండు మూడు సార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అర్థం లేని వాదనలు చేస్తున్నారని, చెప్పిన విషయాలే చెబుతున్నారని, విచారణ ఆదేశాల గురించి తదితర విషయాలపై జగన్ తరఫు న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రి శంకరరావు లేఖపై మంగళవారం వాదనలు ముగిశాయి. బుధవారం తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు లేఖలపై వాదనలు కొనసాగించాల్సి ఉండగా జగన్ తరఫు న్యాయవాది శంకరరావు లేఖ విషయ ప్రస్తావిస్తున్న సమయంలో చెప్పిన విషయాలే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

చెప్పిన విషయాలే చెప్పి కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని ఏం వినాలో తమకు తెలుసని మందలించినట్లుగా తెలుస్తోంది. మరో సమయంలో జగన్‌పై విచారణకు ఆదేశించాలంటే ముందు కంపెనీ ఎఫైర్స్ మినిస్ట్రీ నుండి రికార్డులు తెప్పించాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు సూచించారు. దీనిపై సిజె మండిపడ్డట్టుగా సమాచారం. తీర్పు మా పరిధిలోనిదని అది మాకు వదిలేయండని, మాకు కొన్ని ప్రివిలేజస్ ఉన్నాయని అన్నట్టుగా తెలుస్తోంది. సుప్రీం కోర్టుకు వెళ్లి వచ్చినంత మాతార్న మీరే సుప్రీంగా అనుకోవద్దని కూడా సిజె మందలించినట్లుగా తెలుస్తోంది. కాగా తమ వాదనలు వినిపించడానికి మరో రోజు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేయగా దానిని తోసి పుచ్చారు. కాగా టిడిపి ఫిర్యాదుపై వాదనలు బుధవారం ముగిశాయి. షేర్వాణి పిటిషన్‌పై గురువారం వాదనలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+