గాలి, జగన్లను జె గ్యాంగ్గా అభివర్ణించిన రేవంత్

ఈ ప్రత్యక్ష దోపిడీలో జగన్కు సైతం సంబంధం ఉందని ఆరోపించారు. అక్రమ మైనింగ్పై సిబిఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం కర్నాటక లోకాయుక్త నివేదికను పరిశీలించాలని సూచించారు. అక్రమ మైనింగ్ ఎలా జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా మైనింగ్ వల్ల కోట్లు సంపాదించారని అన్నారు. ఆర్ఆర్ గ్లోబల్ అక్రమ మైనింగుకు పాల్పడిందన్నారు. కర్నాటకలో గనులు కొల్లగొట్టి జగన్కు చెందిన జగతి కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. కర్నాటక అక్రమ ఖనిజాన్ని విదేశాలకు తరలించారని అన్నారు. ఎపిలో కర్నాటక అక్రమ మైనింగ్ మూలాలు ఉన్నాయన్నారు. బలపనూరులో భోజనాలు లేని వైయస్ కుటుంబం బెంగళూరులో బంగ్లాలు ఎలా కట్టిందన్నారు.
కాగా సీనియర్లపై తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్నారని సాక్షి తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని మరో నేత వర్ల రామయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ మేథోమథనంపై అవాస్తవాలు ప్రచురిస్తోందన్నారు. ఇలాంటి నీతిమాలిన చర్యలు మానుకోవాలని సూచించారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ దురుద్దేశ్యంతో టిడిపిపై దుష్ప్రచారం చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications