రామ్ చరణ్ తేజ్ పెళ్లికి తొందరేమీ లేదు: చిరంజీవి

ఆటో డ్రైవర్ల సమస్యపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆటో రిక్షా డ్రైవర్లకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన టిటిడి అధికారులను డిమాండ్ చేశారు. తిరుమల జెఇవో రాజకీయ ప్రతినిధుల పట్ల వ్యవహరించిన తీరు సమంజసంగా లేదని ఆయన అన్నారు. తాను ఈ నెల 20వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెసులో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు, ముఖ్యనేతలు 22వ తేదీన హైదరాబాదులో కాంగ్రెసులో చేరుతారని ఆయన చెప్పారు.
తిరుమలకు తమను అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన ఆటో రిక్షా డ్రైవర్లపై గురువారం పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారి కార్యాలయాన్ని ముట్టడించడానికి వారు ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications