తెలంగాణలో ప్రతి పౌరుడూ పాండవుడే: దానం నాగేందర్

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చలు సామరస్య పూర్వకంగా జరిగాయని ఆయన చెప్పారు. ఉద్యోగులపై ప్రభుత్వం ఏ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని ఆయన అన్నారు. కాగా, సమ్మెపై ఈ నెల 16వ తేదీన నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. ముస్లిం, హిందువుల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే సకల జనుల సమ్మె జరుగుతుందని ఆయన అన్నారు. 17వ తేదీననే సకల జనుల సమ్మె సాగుతుందని ఆయన అన్నారు. దీన్ని రెండు దశలుగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications