తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దటీజ్ చిరంజీవి: ఫలించిన మెగాస్టార్ దౌత్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చిరంజీవి దౌత్యం నేపథ్యంలో తిరుమల ట్యాక్సీ డ్రైవర్లు చేసిన డిమాండ్‌లకు తిరుమల తిరుపతి దేవస్థానం తలొగ్గింది. టిటిడి విధించిన ట్రాఫిక్ నిబంధనలు సడలించింది. ఓ నెల రోజుల పాటు నిబంధనలు వాయిదా వేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. అంతేకాకుండా కొండ పైకి ట్యాక్సీలను అనుమతించకపోతే భక్తులందరికీ సౌకర్యం కల్పించడం కష్టమని కూడా టిటిడి భావించినట్లుగా తెలుస్తోంది. ట్యాక్సీ డ్రైవర్ల డిమాండ్ మేరకు టిటిడి నిబంధన ఆంక్షలను తొలగించడానికి చిరంజీవి చాలా ప్రయత్నాలు చేశారు. తిరుమల కొండ పైకి ట్యాక్సీ డ్రైవర్లను టిటిడి అనుమతించక పోవడంతో వారు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా అలిపిరి వద్ద వారు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు.

కొండ పైకి వెళ్లే బస్సులను అడ్డుకున్నారు. అయితే పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. అయినప్పటికీ వారు తగ్గలేదు. ట్యాక్సీ డ్రైవర్లపై లాఠీఛార్జి జరిగిందని తెలిసిన చిరంజీవి టిటిడి అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. శుక్రవారం హుటాహుటిన తిరుపతి బయలు దేరారు. ఇటు ట్యాక్సీ డ్రైవర్లతో అటు టిటిడి అధికారులతో చర్చించారు. సమస్య పరిష్కరిస్తానని చిరు డ్రైవర్లకు హామీ ఇచ్చారు. చిరంజీవి మాట ఇచ్చినందు వల్ల ట్యాక్సీ డ్రైవర్లు శుక్రవారం నాటి ఆందోళనను వాయిదా వేసుకున్నారు. ఇంతలో చిరంజీవి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, టిటిడి అధికారులతో దౌత్యం నెరపి ప్రస్తుతానికి సమస్యను పరిష్కరించారు.

English summary
Tirupati MLA Chiranjeevi succeeded in solving Tirumala taxi drivers problem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X