వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలితకు ప్రత్యేక కోర్టులో ఎదురు దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayalalitha
బెంగుళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యేక కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రాష్ట్ర శానససభ సమావేశాలు ఉన్నందున, పలు అధికారిక కార్యక్రమాలు ఉన్నందున కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని జయలలిత తరఫు న్యాయవాది బి కుమార్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ న్యాయమూర్తి బిఎం మల్లికార్జునయ్య తదుపరి విచారణకు జయలలిత వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు 1991, 1996 మధ్య కాలంలో జయలలిత రూ. 66.65 కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆమెతో పాటు ఆమె ప్రియమిత్రురాలు శశికళ, దత్తపుత్రుడు సుధాకరన్, ఎలావెరసన్ కూడా నిందితులు. ఈ కేసును సుప్రీంకోర్టు 2003లో చెన్నై నుంచి బెంగుళూర్ కోర్టుకు మార్చింది.

English summary
The Special Court trying the disproportionate asset case filed against Tamil Nadu Chief Minister J Jayalalitha, Friday, rejected her plea seeking exemption from personal appearance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X