ఫేక్ ఉద్యోగుల ఏరివేతను ప్రారంభించిన మహీంద్రా సత్యం
భారత్లోని హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరు కేంద్రాల్లో సుమారు 21,000 మంది ఉద్యోగులు నకిలీ సర్టిఫికేట్లతో విధుల్లోకి చేరారని, ప్రస్తుతం వీరికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోందని, ఈ ప్రక్రియ సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తవుతుందని మహీంద్రా సత్యం ఛీఫ్ పీపుల్ ఆఫీసర్ (సీపీఓ) టి హరి తెలిపారు. వీరిలో ఎవరైనా ఉద్యోగులు కంపెనీ మోసం చేసినట్లు రుజువైతే వారిని విధుల్లోంచి తొలగించడమే కాకుండా, చీటింగ్ కేసును సైతం పెట్టనున్నామని హరి చెప్పారు.
అనుమానిత ఉద్యోగుల గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన సంస్థల సహాయంతో వివరాలను సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరడాన్ని కంపెనీ చాలా సీరియస్గా తీసుకుందని, ఇప్పటికే ఇలా చేరి 7 గురు వ్యక్తులపై కేసులను ఫైల్ చేయడం జరిగిందని అలాగే, మరో డజను మంది ఉద్యోగులపై కేసు ఫైలింగ్ విధానం కొనసాగుతోందని హరి చెప్పారు. ఉద్యోగులు సమర్పించే వివిధ సంస్థల నుంచి తీసుకువచ్చిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లపై (అనుభవ పత్రాలు) అనుమానం రావడం ద్వారా ఈ విషయాన్ని గుర్తించడం జరిగిందని ఆయన చెప్పారు.