దుష్ట శక్తులను ఎదుర్కొనేందుకు పని చేయాలి: బొత్స

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అన్నా హజారేను అవినీతిపరుడిగా చిత్రీకరించడం బాధాకరం అన్నారు. లోకాయుక్త, కోర్టులే అవినీతిపై స్పందిస్తున్నాయని, ప్రభుత్వాలు మాత్రం నిర్లిప్తంగా ఉన్నాయని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర రావు, నల్లు ఇంద్రసేనా రెడ్డి తదితరులు హాజరు అయ్యారు. కరీంనగర్లో ఎంపీ పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. వైయస్సాఆర్సీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో నారాయణ, టిఆర్ఎస్ కార్యాలయంలో నాయిని నరసింహా రెడ్డి ఎగురవేశారు.












Click it and Unblock the Notifications