వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తెలంగాణ తరహా త్వరలో జై ఆంధ్ర ఉద్యమం'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: దేశభక్తితోనే తాము తెలంగాణ ఉద్యమం చేస్తున్నామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ సోమవారం తెలిపారు. జెఏసి కార్యాలయంలో ఆయన జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 17న జరిగే మహాధర్నాకు తెలంగాణ వారంతా సహకరించాలని కోరారు. 17 నుండి ఉద్యమం విడతల వారీగా ఉధృతమవుతుందని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు.

జాతీయ స్థాయిలో అవినీతిపై పోరాటం చేస్తున్న సామాజిక సంస్కర్త అన్నా హజారే ఉద్యమానికి జెఏసి మద్దతు ఉంటుందని కోదండరామ్ ప్రకటించారు. తెలంగాణ పోరాటం, అవినీతిపై అన్నా హజారే చేస్తున్న పోరాటం నాణేనికి రెండు పార్శ్వాలు అన్నారు. కాగా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సీమాంధ్ర సెటిలర్స్ చైతన్య యాత్ర సోమవారం జెఏసి కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర నినాదం పాలకులది మాత్రమే అన్నారు. అక్కడి ప్రజలు సైతం విడిపోయి అభివృద్ధి చెందుతామన్న భావనతో ఉన్నారని అన్నారు. త్వరలో అక్కడ జై ఆంధ్రా ఉద్యమం పుట్టుకు వస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

English summary
Telangana Political JAC and Seemandhra Settelers Chaithanya Yatra hoped that Jai Andhr movement will come soon in Andhra region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X