వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా హజారే దీక్షపై ప్రధాని మన్మోహన్ చురక

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: పటిష్టమైన జన్ లోక్‌పాల్ బిల్లు కోసం నిరాహార దీక్ష తలపెట్టన సామాజిక కార్యకర్త అన్నా హజారేకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పరోక్షంగా చురక అంటించారు. అవినీతిని అంతం చేయడానికి పటిష్టమైన లోక్‌పాల్ బిల్లుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. నిరాహార దీక్షలు అవినీతిని రూపుమాపలేవని ఆయన అన్నా హజారే దీక్షను ఉద్దేశించి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. అవినీతి సమస్యను రూపుమాపడానికి ఏ ప్రభుత్వం వద్ద కూడా మంత్రదండం ఉండదని, పలు విధాలుగా దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు భుజం భుజం కలిపి ముందుకు రావాలని ఆయన సూచించారు. న్యాయవ్యవస్థ లోక్‌పాల్ పరిధిలోకి రాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏ విధమైన లోక్‌పాల్ చట్టం తేవాలనే విషయంపై పార్లమెంటు మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుత బిల్లుపై భేదాభిప్రాయాలు ఉన్న విషయం తనకు తెలుసునని, ప్రస్తుత బిల్లును అంగీకరించనివారు పార్లమెంటులో, మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించాలని ఆయన అన్నారు. వారు నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టబోరని తాను నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. భూ సేకరణ, నక్సలిజం, ఉగ్రవాదం, ఆర్థికం వంటి పలు అంశాలను మన్మోహన్ సింగ్ తన ప్రసంగంలో స్పృశించారు.

English summary
With government facing attack over multiple scams, Prime Minister Manmohan Singh on Monday promised a strong Lokpal to end corruption in high places and asserted that hunger strikes will not help address the problem, in an apparent reference to Anna Hazare's agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X