వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోమటిరెడ్డి డుమ్మా, తెలంగాణ మంత్రులు హాజరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటైన మంత్రి వర్గ సమావేశానికి ముగ్గురు మినహా తెలంగాణ మంత్రులంతా హాజరయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పి. శంకరరావు, సారయ్య ఈ సమావేశానికి హాజరు కాలేదు. రెండు నెలల తర్వాత ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ కోసం తాను మంత్రివర్గ సమావేశానికి వెళ్లడం లేదని, తెలంగాణ మంత్రులు వెళ్లకూడదని కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ మేరకు ఆయన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టారు.

తన కన్ను సరిగా లేనందున మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావడం లేదని పి. శంకరరావు ముఖ్యమంత్రికి సమాచారం అందించారు. సారయ్య ఎందుకు హాజరు కాలేదనేది తెలియడం లేదు. కె. జానారెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డి, డికె అరుణ, రాంరెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ వంటి తెలంగాణ మంత్రులు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ మంత్రులను మంత్రివర్గ సమావేశానికి రప్పించడం ద్వారా ముఖ్యమంత్రి విజయం సాధించారని భావిస్తున్నారు. సచివాలయంలో కాకుండా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేస్తే మంత్రి వర్గ సమావేశానికి వస్తామని తెలంగాణ మంత్రులు చెప్పారు. ఆ మేరకు సమావేశానికి హాజరయ్యారు.

English summary
Telangana ministers attended cabinet meeting held at CM Kirankumar Reddy's camp office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X