హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఇంటిపై, సంస్థలపై దాడులు షురూ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో, ఆయన సంస్థల్లో సోదాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయమే సిబిఐ అధికారులు సోదాలకు శ్రీకారం చుట్టారు. లోటస్ పాండ్‌లో వైయస్ జగన్ నివాసంలో 11 మంది అధికారులతో కూడిన బృందం సోదాలు చేసింది. హైదరాబాదు బంజారాహిల్స్‌లోని భారతి సిమెంట్స్ కార్యాలయంపై కూడా సిబిఐ అధికారులు దాడి చేశారు.

సిబిఐ అధికారులు 12 బృందాలుగా విడిపోయి 28 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బృందంలో ఆరుగురు అధికారులు ఉన్నారు. మహేంద్రహిల్స్‌లోని ఐఎఎస్ అధికారి ఆచార్య నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాదులోని సైనిక్‌పురిలో గల నిమ్మగడ్డ ప్రసాద్ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌పై కూడా సోదాలు ప్రారంభమయ్యాయి.

English summary
CBI officers began raids on YSR Congress party president YS Jagan's residences and offices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X