ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఇప్పటికైనా బయట పెట్టాలి: డిఎల్ రవీంద్రా రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
ఒంగోలు/అనంతపురం: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన ఆదాయ వివరాలను ప్రజల ముందు పెట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి గురువారం ప్రకాశం జిల్లాలో విలేకరులతో అన్నారు. తప్పు ఎవరు చేసినప్పటికీ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని అన్నారు. ఎమ్మార్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న తన ఆరోపణలు వాస్తవమని సిబిఐ దర్యాఫ్తు ద్వారా తేలిందన్నారు. ఇప్పటి వరకు సరియైన జెండా కూడా లేని వైయస్సార్సీ పార్టీ ఇంకా ఎంతోకాలం నిలబడదని అన్నారు.

జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ పూర్తిగా నిష్పక్షపాతంగా జరుగుతోందని మంత్రి శైలజానాథ్ అనంతపురం జిల్లాలో అన్నారు. తను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెబుతోన్న జగన్ సిబిఐ విచారణకు పూర్తిగా సహకరించి తన సచ్ఛీలత నిరూపించుకోవాలని సూచించారు. విచారణలో పూర్తి వివరాలు బయటపడతాయని అన్నారు.

English summary
Minister DL Ravindra Reddy demanded YSRC party president YS Jaganmohan reddy today that to reveal his secret of properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X