జగన్ చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేసుకున్నారు?

సిగ్గు లేకుండా చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని, తనపై రాజకీయంగా కుట్ర చేశారని ఆయన అంటున్నారు. మరణించినప్పటికీ వైయస్ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు సిద్ధపడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు. మాట నిలబడాలని తనకు వైయస్సార్ నేర్పించారని ఆయన చెప్పుకుంటున్నారు. కాంగ్రెసు నుంచి బయటకు వచ్చినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆయన అంటున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని సీమాంధ్రలో కూకటివేళ్లతో సహా పెకిలించే ఉద్దేశంతోనే కాకుండా తనను ఒంటరి చేసి రాజకీయంగా దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రజల్లో సానుభూతి పొందడం కూడా ఆయన వ్యాఖ్యల్లోని అంతరార్థంగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications