హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ అల్లుడు అనిల్ బ్రదర్ ఆఫీసుపై దాడులు

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: వైయస్ జగన్, ఎమ్మార్ కేసుల్లో సిబిఐ అధికారులు శుక్రవారం ఉదయమే సోదాలు ప్రారంభించారు. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించిన సిబిఐ అధికారులు శుక్రవారం ఉదయమే అందుకు సిద్ధమయ్యారు. ఖమ్మంలో వైయస్సార్ అల్లుడు అనిల్ బ్రదర్‌కు చెందిన బయ్యారం మైన్స్ కార్యాలయంపై శుక్రవారం సిబిఐ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాదులోని సోమాజిగుడాలో గల బ్రాహ్మణి ఇన్ఫోటెక్ కార్యాలయంలో సిబిఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నల్లగొండలోని హరితా ఫెర్టిలైజర్స్ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. మ్యాట్రిక్స్ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.

అలాగే, సికింద్రాబాదులోని నిమ్మగడ్డ ప్రసాద్ ఫౌండేషన్‌ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. గురువారంనాడు జగన్ సంస్థల్లో, ఇళ్లలో తనిఖీలు చేసిన సిబిఐ అధికారులు శుక్రవారం జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలపై దృష్టి కేంద్రీకరించారు. పెన్నా సిమెంట్స్ కార్యాలయంలో, ఆ సంస్థ అధినేత ఇంటిలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాన్‌పిక్ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. నవభారత్ వెంచర్స్, కన్‌స్ట్రక్షన్ కార్యాలయాల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. సిబిఐ అధికారులు శుక్రవారం ఉదయం ఆరు బృందాలుగా దిల్‌కుషా అతిథి గృహం నుంచి బయలుదేరి సోదాలు నిర్వహిస్తున్నారు.

English summary
CBI is containing searches second day friday in YS Jagan and Emaar cases. Anil brother office raided at Khammam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X