అల్లు అరవింద్ చేతిలో చిరు రిమోట్, తమ్ముళ్లు బేజారు

వైయస్ జగన్ను ఎదుర్కోవడానికి కాంగ్రెసు చేరదీసిన ఆషాఢభూతుల్లో చిరంజీవి ఒకరని, అయితే కాంగ్రెసు ఏరు దాటాక తెప్ప తగిలేస్తుందని వ్యాఖ్యానించింది. అయితే చిరంజీవి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించింది. చిరంజీవి విలీనం నిర్ణయం తీసుకుని ఇంటి మనుషుల ముందే బోనులో నిలబడ్డారని వ్యాఖ్యానించింది. విలీనం నిర్ణయాన్ని చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగంగా వ్యతిరేకించలేక దూరంగా ఉంటున్నట్లు చెప్పింది. విలీనం నిర్ణయం వల్ల, అరవింద్ చర్యల వల్ల చిరంజీవితో తమ్ముళ్లతో విభేదాలు పొడసూపినట్లు సాక్షి వ్యాఖ్యానించింది. వ్యాపార లావాదేవీల్లో, ఆర్థిక వ్యవహారాల్లో కూడా పూర్తిగా విడిపోయినట్లు చెప్పింది.












Click it and Unblock the Notifications