రాష్ట్రంలో భారీ వర్షాలు, హైదరాబాద్ జలమయం

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ వర్షం పడింది. దీంతో హైదరాబాదులోని రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. చాలా చోట్ల మోకాళ్ల లోతు నీరు చేరుకుంది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ జామ్లు చోటు చేసుకున్నాయి. కర్నూలు జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వరద ధాటికి కుందూనది, పాలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉదృతికి జిల్లాలోని పెద్దయమ్మినగూరు వంతెన కొట్టుకుపోయింది. దీంతో వేలాది ఎకరాల పంట నీటిమునిగింది. అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications