స్త్రీని కత్తితో పొడిచి తానూ పొడుచుకున్న యువకుడు

Hyderabad
హైదరాబాద్: పట్టపగలే హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో ఓ యువకుడు మహిళను కత్తితో పొడిచి తాను పొడుచుకున్నాడు. గాయపడిన ఇద్దరిని కూడా ఆస్పత్రికి తరలించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో గల ఇన్‌కమ్ టాక్స్ రెసిడెన్సీ క్వార్టర్స్‌లో ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పనిమనిషి మనవడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ప్రవీణ్ కుమార్, ప్రశాంతి అనే దంపతులు ఇన్‌కమ్ ట్యాక్స్ రెసిడెన్సీ క్వార్టర్స్‌లో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారి ఇంట్లో ఓ పని మనిషి రెండేళ్లుగా పనిచేస్తోంది. తనకు ఆరోగ్యం బాగా లేకపోవడం ఆ పని మనిషి తన మనవడిని పనికి పంపింది. అతనికి దాదాపు 20 ఏళ్లుంటాయి. అయితే, మంగళవారం ప్రశాంతి ఒక్కతే ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఆ యువకుడు ఆమెను వంటగదిలోని కత్తితో పొడిచాడు. ఆమె పెద్దగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చారు. దాంతో అతను తానూ పొడుచుకున్నాడు. ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+