వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య, టిటిడికి బాపిరాజు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Rosaiah
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తమిళనాడు వర్నర్‌గా నియమితులయ్యారు. ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనను తమిళనాడు గవర్నర్‌గా పంపిస్తూ రేపు శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఆయన 1968, 74, 80ల్లో ఎమ్మెల్సీగా పనిచేశారు. 1995-97ల మధ్య రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రోశయ్య పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా శాసన సభలో 16 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. వైఎస్‌ మరణానంతరం 2009 సెప్టెంబర్‌ 3 నుంచి 2010 నవంబర్‌ 24 వరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తమిళనాడు గవర్నర్‌గా తన నియామకం గురించి రోశయ్యకు రాష్టపతి భవన్ నుంచి సమాచారం అందింది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి ఛైర్మన్‌గా నరసాపురం లోక్‌సభ సభ్యుడు కనుమూరి బాపిరాజు నియమితులయ్యారు.ప్రత్యేక సాధికారిక మండలి గడువు ముగియడంతో బాపిరాజును నియమించారు. ఈ పదవికి చిరంజీవి బావమరది అల్లు అరవింద్‌, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుల పేర్లు వినిపించినప్పటికీ బాపిరాజును ఆ పదవి వరించింది. బాపిరాజు గతంలో రాష్ట్ర దేవాదాయ, ఎక్సైజ్‌ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. టిటిడి చైర్మన్‌గా బాపిరాజును నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

English summary
Former Andhra Pradesh CM K Rosaiah nominated as Tamilnadu governor. MP Kanumuri Bapiraju appointed as TTD chairman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X