Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య, టిటిడికి బాపిరాజు

K Rosaiah
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తమిళనాడు వర్నర్‌గా నియమితులయ్యారు. ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనను తమిళనాడు గవర్నర్‌గా పంపిస్తూ రేపు శుక్రవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఆయన 1968, 74, 80ల్లో ఎమ్మెల్సీగా పనిచేశారు. 1995-97ల మధ్య రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రోశయ్య పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా శాసన సభలో 16 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. వైఎస్‌ మరణానంతరం 2009 సెప్టెంబర్‌ 3 నుంచి 2010 నవంబర్‌ 24 వరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తమిళనాడు గవర్నర్‌గా తన నియామకం గురించి రోశయ్యకు రాష్టపతి భవన్ నుంచి సమాచారం అందింది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి ఛైర్మన్‌గా నరసాపురం లోక్‌సభ సభ్యుడు కనుమూరి బాపిరాజు నియమితులయ్యారు.ప్రత్యేక సాధికారిక మండలి గడువు ముగియడంతో బాపిరాజును నియమించారు. ఈ పదవికి చిరంజీవి బావమరది అల్లు అరవింద్‌, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుల పేర్లు వినిపించినప్పటికీ బాపిరాజును ఆ పదవి వరించింది. బాపిరాజు గతంలో రాష్ట్ర దేవాదాయ, ఎక్సైజ్‌ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. టిటిడి చైర్మన్‌గా బాపిరాజును నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+