వైయస్ జగన్‌పై దాడికి చిరంజీవి రెడీ, జిల్లాల్లో సభలు

Chiranjeevi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెసు ప్రస్తుత నాయకుడు చిరంజీవి సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను జిల్లా పర్యటనలు చేయాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో భేటీ అయిన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు చిరంజీవి పర్యటనపై చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం పూర్తయిన నేపథ్యంలో దాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు మూడుజిల్లాలకు ఒకటి చొప్పున కార్యక్రమాలను నిర్వహించాలని, వాటిద్వారా విలీనాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని పీఆర్పీ, కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ కార్యక్రమాల్లో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, చిరంజీవి పాల్గొంటారు. పార్టీలో జిల్లా స్థాయి మొదలుకుని ఎవరికి ఏ ప్రాధాన్యతలు ఇవ్వనున్నారనే దానిపైనా సమావేశంలో బొత్సతో శాసనసభ్యులు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. విలీనాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లే కార్యక్రమాలతో పాటు నేతల ప్రాధాన్యతలపైనా శుక్రవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

జగన్‌పై ఎదురుదాడి విషయంలో కాంగ్రెస్‌పార్టీ నేతలు పరిధులు పాటించాల్సి వస్తోంది. వాస్తవానికి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడగట్టుకున్నాడనేది జగన్‌పై ఉన్న ఆరోపణ. దీన్నే ఆధారంగా చేసుకుని జగన్‌పై అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. వైఎస్‌పైనా విరుచుకుపడేందుకు కాంగ్రెస్ నేతలతో పోలిస్తే చిరంజీవికి వెసులుబాటు ఉండడంతో జగన్‌పై దాడికి ఈ జిల్లా పర్యటనలను వాడుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+