రాజీవ్ హత్య కేసు: వచ్చే నెల 9న ముగ్గురికి ఉరిశిక్ష

ఇరవై ఏళ్ల క్రితం తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఆ ముగ్గురు కూడా జైలులోనే మగ్గుతున్నారు. ఈ కేసులో నళినికి విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చారు. నళిని మహిళ కావడం, ఆమె పిల్లల తల్లి కావడంతో ఆ వెసులుబాటు ఇచ్చారు. అయితే, ఉరిశిక్షపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. సినీ ప్రముఖులు ఉరిశిక్ష అమలు కాకుండా చూసేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఉరిశిక్ష వేయడం దారుణమని ప్రముఖ నటుడు భారతీరాజా అన్నారు. అహింస, మావనత్వానికి మారుపేరైన భారతదేశంలో ఉరిశిక్షను రద్దు చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications