హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు మేం రక్షణ కల్పిస్తాం: నాగం జనార్దన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ విద్యార్థులతో మాట్లాడితే తాము రక్షణ కల్పిస్తామని ఆ పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి శుక్రవారం అన్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయిన అనంతరం నాగం, మరో ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అవినీతిపై ఆంధ్రా విద్యార్థులతో మాట్లాడుతున్న చంద్రబాబు తెలంగాణలో జరుగుతున్న దోపిడిపై మాట్లాడాలని కోరారు. తెలంగాణ విద్యార్థులతో మాట్లాడితే మేం సిద్ధంగా ఉన్నామని, అందుకు సంతోషిస్తామన్నారు. బాబుకు రక్షణ కల్పించడానికి సైతం సిద్ధంగా ఉన్నామన్నారు.

వెయ్యి కోట్ల రూపాయలు రాసిస్తానంటున్న చంద్రబాబుకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలన్నారు. హోంశాఖలో జరుగుతున్న అన్యాయంపై ఆ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడక పోవడం బాధాకరం అన్నారు. స్పీకరు నాదెండ్ల మనోహర్ రాజీనామాలపై సాయంత్రం లోగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారన్నారన్నారు. రాజీనామాలపై ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఇకనైనా జాప్యం జరగదని ఆశిస్తున్నామన్నారు. మా వాదనలు మేం వినిపించామని రాజీనామాలు తిరస్కరించే అవకాశం లేదని మరో ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి అన్నారు.

చంద్రబాబు అవినీతిపై పోరాడతానంటే ప్రజలు ఎవరూ నమ్మె స్థితిలో లేరని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ అన్నారు. దేశంలోనే అతిపెద్ద అవినీతి వ్యతిరేక ఉద్యమం తెలంగాణ ఉద్యమం అన్నారు. రాజీనామాలు చేయని ఎమ్మెల్యేలు, ఆంధ్రా పాలకులను అడ్డుకోవడమే సకల జనుల సమ్మె లక్ష్యమన్నారు. మద్యం తాగడం మానేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలన్నారు.

English summary
Telugudesam Party suspended mla Nagam Janardhan Reddy said today that they will protect party chief Chandrababu Naidu if he will ready to talk with Telangana students as Andhra students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X