వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీరావు, బాబును టార్గెట్ చేసిన జగన్ వర్గం నేత!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bagireddy Govardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావులకు చెందిన ఆస్తులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు స్వీకరించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కు ఆదేశించాలని వైయస్సార్సీ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి వెయ్యి కోట్లకు ఎదిగారో అందరికీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబు నెల్లూరులో 350 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అమీర్ పేట భూకంభకోణం కేసు తేలాకే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబరు 2వ తారీఖున మరికొంతమంది శాసనసభ్యులు రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు.

English summary
YSRC party leader Bagireddy Goverdhan Reddy targetted tdp chief Chandrababu Naidu and Ramoji Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X