జగన్ భయం, కొత్త ఎమ్మెల్యేలతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి దాదాపు 25 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. జగన్కు మద్దతుగా గతంలో మాట్లాడిన జోగి రమేష్ వంటివారు కూడా ఈ సమావేశానికి వచ్చారు. తమ తమ నియోజకవర్గాల్లో పెన్షన్లు, ఇళ్లు రేషన్ కార్డులు ఇవ్వాలని తాము కోరినట్లు జోగి రమేష్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. రచ్చబండలో ఇచ్చిన దరఖాస్తులపై కూడా చర్యలు తీసుకోవాలని తాము విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి నిధులు ఇవ్వాలని కూడా కోరినట్లు ఆయన తెలిపారు. పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలపై కూడా సమావేశంలో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తమ డిమాండ్లకు ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications