గాలి అక్రమాల్లో వైయస్ జగన్కూ పాత్ర: చంద్రబాబు

గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు మైనింగ్ మాఫియాపై తాము చేస్తున్న పోరాటంలో తొలి విజయమని తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తాము మొదటి నుంచీ పోరాటం చేస్తున్నామని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదికను సిబిఐకి ఇచ్చి గాలి జనార్దన్ రెడ్డి కేసులో సహకరించాలని ఆయన అన్నారు. బిజెపికి మరింత దగ్గరయ్యేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసుకు దగ్గరయ్యేందుకు జగన్ మంతనాలు జరుపుతున్నారని ఆయన అన్నారు.
మైనింగ్ మాఫియాతో వైయస్ జగన్కు కూడా భాగం ఉందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి సొమ్మును మొత్తం జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా తాము మొదటి నుంచి పార్లమెంటులో కూడా పోరాటం చేస్తూ వస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications