చిరంజీవి రాజకీయం, త్వరలో సొంత టీవీ చానెల్

Chiranjeevi
హైదరాబాద్‌: కాంగ్రెసులో ఓ పవర్ సెంటర్‌గా నిలబడడానికి తన పాత ప్రజారాజ్యం పార్టీని క్యాంపు కార్యాలయంగా మార్చుకుంటున్న తిరుపతి శానససభ్యుడు చిరంజీవి ఓ టీవీ చానెల్ ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. చిరంజీవి భాగస్వామ్యంతో త్వరలో ఒక టీవీ ఛానల్‌ ప్రారంభం కాబోతోంది. ఆయనకు సన్నిహితులైన అనకాపల్లి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు, గత ఎన్నికల్లో గుంటూరు నుంచి ప్రజారాజ్యం తరఫున లోక్‌సభకు పోటీ చేసిన తోట చంద్రశేఖర్‌ కూడా ఈ ఛానెల్‌లో భాగస్వాములుగా ఉన్నారు. అక్టోబర్‌ నెలాఖరు వరకు దీని ప్రసారాలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి 'ఎస్‌ న్యూస్‌'గా నామకరణం చేసినట్లు చిరంజీవి సన్నిహిత వర్గాల సమాచారం. తమకంటూ సొంత ఛానల్‌ ఉంటే కిందటి ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని అప్పట్లో ప్రజారాజ్యంనాయకులు అభిప్రాయపడుతుండేవారు. కొత్త ఛానల్‌ ఆ లోటును భర్తీ చేసే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెసు పార్టీలో విలీనమైన ప్రజారాజ్యం ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు శాసనసభ్యులు, మంత్రులు తరచూ చిరంజీవిని కలుస్తున్నారు. వీరంతా భవిష్యత్‌ అవసరాల కోసమే కలుస్తున్నా మున్ముందు పార్టీలో ఒక ప్రధాన వర్గాన్ని తయారు చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రాంతీయ విలీన సభల పేరుతో జన సమీకరణతో విశాఖపట్నం, గుంటూరు, అనంతపురంలో భారీ బహిరంగ సభల్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి నిర్వహణ బాధ్యతనూ పాత ప్రజారాజ్యం పార్టీ నాయకులకే అప్పగిస్తూ వీటిని బల ప్రదర్శనను చాటుకునేందుకు వేదికలుగా మలచుకోవాలనీ చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+