ఉప ఎన్నికలకే మొగ్గు, లాభమని జగన్ అంచనా

సీబీఐ దాడులు, ఎఫ్ఐఆర్లో వైఎస్ పేరు చేర్చడం, రాజీనామాల అనంతరం క్షేత్ర స్థాయిలో పరిస్థితులు, ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందనే వంటి వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సీబీఐ దాడులు, కేసులపై ఆందోళన వద్దని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. ఉప ఎన్నికలు జరిగినా లేదా మధ్యంతర ఎన్నికలొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్కే ఆదరణ ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజీనామాలను ఆమోదించుకొని ఎన్నికలకు వెళ్తేనే పార్టీకి ఉపయోగమన్నారు. ఉపఎన్నికల్లో గెలిస్తే పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుందని వివరించారు. దీనివల్ల కడప జిల్లాలోనే జగన్ ప్రభావం ఉందనే విమర్శలకు సమాధానం చెప్పినట్లవుతుందన్నారు.
సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వైఎస్ పేరును కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే చేర్చిందనే అంశం ప్రజల్లోకి వెళ్లిపోయిందని జగన్ అన్నారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతలను కలుస్తానని, రెండు రోజులపాటు అక్కడే ఉంటానని వివరించారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 2014లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని అన్నట్లు తెలిసింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications