ఉప ఎన్నికలకే మొగ్గు, లాభమని జగన్ అంచనా

YS Jagan
హైదరాబాద్‌: తన ఆస్తులపై సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో ఉప ఎన్నికలను ఆహ్వానించి ప్రజాక్షేత్రంలో తన బలాన్ని నిరూపించుకోవడం ద్వారా నైతిక బలాన్ని సమకూర్చుకోవాలని, ప్రత్యర్థులకు తన సత్తా ఏమిటో చూపించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు వస్తేనే ప్రయోజనమని ఆయన అభిప్రాయపడుతున్నారు. దీంతో రాజీనామాలు ఆమోదించుకోవాలని తన వర్గం ఎమ్మెల్యేలకు సూచించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో 23 మందితో జగన్‌ ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఆదివారం భేటీ అయ్యారు. పలువురు ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు.

సీబీఐ దాడులు, ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ పేరు చేర్చడం, రాజీనామాల అనంతరం క్షేత్ర స్థాయిలో పరిస్థితులు, ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందనే వంటి వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సీబీఐ దాడులు, కేసులపై ఆందోళన వద్దని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. ఉప ఎన్నికలు జరిగినా లేదా మధ్యంతర ఎన్నికలొచ్చినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌కే ఆదరణ ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజీనామాలను ఆమోదించుకొని ఎన్నికలకు వెళ్తేనే పార్టీకి ఉపయోగమన్నారు. ఉపఎన్నికల్లో గెలిస్తే పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుందని వివరించారు. దీనివల్ల కడప జిల్లాలోనే జగన్‌ ప్రభావం ఉందనే విమర్శలకు సమాధానం చెప్పినట్లవుతుందన్నారు.

సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వైఎస్‌ పేరును కాంగ్రెస్‌ సర్కారు ఉద్దేశపూర్వకంగానే చేర్చిందనే అంశం ప్రజల్లోకి వెళ్లిపోయిందని జగన్‌ అన్నారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతలను కలుస్తానని, రెండు రోజులపాటు అక్కడే ఉంటానని వివరించారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని, సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని అన్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+