వైయస్ జగన్ గడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతల ఫైర్

YS Jaganmohan Reddy
హైదరాబాద్‌: గడ్డి తింటున్నారా అంటూ తమ పార్టీ పార్లమెంటు సభ్యులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా పలువురు కాంగ్రెసు నాయకులు ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ పచ్చి మిర్చి తింటున్నారా అంటూ బొత్స సత్యనారాయణ అడిగారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నంత మాత్రాన అటువంటి వ్యాఖ్యలు చేయవచ్చునా అని ఆయన అడిగారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని ఆయన అన్నారు. తాము గడ్డి తింటే వైయస్ జగన్ గనులను, నోట్ల కట్టలను తింటున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ ఢిల్లీ ఓ మాట గల్లీలో మరో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి కూడా వైయస్ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా వైయస్ జగన్ ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కూడా జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము గడ్డి తిని పాలిచ్చే పశువులమైతే వైయస్ జగన్ ఖజానాను దోచుకుని మింగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సహచర పార్లమెంటు సభ్యులపై జగన్ ఆ విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+