హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాన్సువాడపై కాంగ్రెసుదీ అదే దారి, పోటీ వద్దంటున్న బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వచ్చే నెలలో జరగనున్న బాన్సువాడ ఉప ఎన్నికలలో పోటీ చేసే విషయంలో కాంగ్రెసు పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ దారిలోనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాన్సువాడ ఉప ఎన్నికల్లో పోటీ చేయవద్దనే నిర్ణయం తెలుగుదేశం అధికారికంగా తీసుకోనప్పటికీ దాదాపు నేతలంతా పోటీ చేయవద్దనే నిర్ణయానికే వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ కూడా పోటీ చేయవద్దనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పోటీలో నిలపక పోవడమే మంచిదన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. బొత్స సోమవారం సాయంత్రం బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెసు నేతలతో సమావేశం కానున్నారు. నియోజకవర్గం నేతలు కూడా నిలబెట్టక పోవడమే మంచిదన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణకు చెందిన ఎంపీ వివేక్ తదితరులు కూడా నిలబెట్టవద్దని పార్టీకి సూచిస్తున్నారు. బొత్స సత్యనారాయణ మంగళవారం ఢిల్లీ వెళుతున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు, డిస్ట్రిక్ట్ కాంగ్రెసు కమిటీ పునర్వవ్యవస్థీకరణ అంశం అధిష్టానం వద్ద ఆయన చర్చిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు బాన్సువాడ పోటీపై కూడా ఆయన చర్చించనున్నారని సమాచారం. తెలంగాణ సెంటిమెంట్ తీవ్రంగా ఉన్న దృష్ట్యా పోటీ చేయక పోవడమే ఉత్తమమని అధిష్టానానికి చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఉప ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెసు, టిడిపి అభ్యర్థులు దారుణంగా ఓడిపోయిన విషయాన్ని అధిష్టానం దృష్టికి బొత్స తీసుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

English summary
Congress is thinking that to do not contest from Banswada byelection. PCC chief Botsa Satyanarayana may suggest high command on bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X