బాన్సువాడ ఉప ఎన్నికలో పోటీకే కాంగ్రెసు నిర్ణయం
బొత్స సత్యనారాయణ సహా డి. శ్రీనివాస్, షబ్బీర్ అలీ బాన్సువాడలో పోటీకి దిగకూడదనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పోటీ చేయాలని భావిస్తూ వస్తున్నారు. చివరకు ముఖ్యమంత్రి మాటనే నెగ్గింది. బాన్సువాడలో పోటీ చేయడానికి ఎనిమిది ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు. ఎనిమిది మందిలో ఎవరు అభ్యర్థి అయినా గెలిపించాలని బొత్స, కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. మండలాలవారీగా సమావేశాలు నిర్వహించి, అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తామని పిసిసి కార్యదర్శి రత్నాకర్ చెప్పారు. ఈ నెల 16, 17 తేదీల్లో బాన్సువాడలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతారు.
కాగా, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ పోటీకి విముఖంగా ఉన్నారు. పార్టీ అభ్యర్థిని పోటీకి దించితే తాను ప్రచారానికి వెళ్లబోనని సమావేశానికి ముందు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. పోటీకి దించకుండా అధిష్టానానికి తెలంగాణపై సంకేతాలు పంపాలని ఆయన సూచించారు. తెలంగాణ స్టీరింగ్ కమిటీ గాడి తప్పిందని ఆయన విమర్శించారు.