నాకు ప్రాణహాని ఉంది: విజయసాయి రెడ్డి ఫిర్యాదు

Sakshi - Logo
హైదరాబాద్: తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుంచి తనకు ప్రాణహాని ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం డిజిపికి, ఇంటలిజెన్స్ డిజికి లేఖలు రాశారు. వైయస్ రాజశేఖర రెడ్డి పేరును అప్రతిష్టపాలు చేయాలని, వైయస్ జగన్ రాజకీయ భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నవారు తనపై కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.

జగన్ నుంచి, ఇతర కంపెనీల నుంచి తనకు ముప్పు ఉందంటూ ఒక మీడియా సంస్థ దుష్ప్రచారం చేస్తోందని, టిడిపి శానససభ్యుడు పయ్యావుల కేశవ్ కూడా మీడియా ముందు ఇవే ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. తనకు హాని చేసి దాన్ని జగన్ పనిగా చూపించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. సిబిఐ విచారణకు వెళ్తున్న సమయంలో కొంత మంది తనను అనుమానంగా చూస్తున్నట్లు తనకు అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు.

తనకు ప్రమాదం పొంచి ఉందని కొందరు రాజకీయ నాయకులు చేస్తు్న ప్రచారం వెనక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న ప్రచారం నిరాధారమైందని, జగన్ కంపెనీల వ్యవహారాలన్నీ పారదర్శకంగానే ఉన్నాయని ఆయన అన్నారు. ఏ విధమైన తప్పు జరగలేదనే నిజం ఏనాటికైనా రుజువు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+