ఆ కంపెనీ కొనుగోలుతో ఇన్పోసిస్ చరిత్రలో కొత్త నాంది

ఇటీవల కొంతకాలంగా ఇన్ఫోసిస్పై మార్కెట్ వర్గాలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కంపెనీ చేతిలో భారీగా నగదు నిల్వలుండటమే దీనికి కారణం. కంపెనీ వీటిని ఎలా వినియోగిస్తుందన్న ఆసక్తి ఇటు విశ్లేషకుల్లోనూ, అటు ఇన్వెస్టర్లలోనూ నెలకొని ఉంది. అయితే అమెరికన్ కంపెనీ కొనుగోలుపై ఇన్ఫోసిస్ పెదవి విప్పనప్పటికీ డీల్ దాదాపు తుది దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి నెలకొల్పిన ప్రమాణాలను పాటిస్తూ ఇన్ఫోసిస్ను సరికొత్త బాటలో నడిపేందుకు సిద్ధమని చైర్మన్గా పదవి చేపట్టిన కేవీ కామత్ గత నెలలో ప్రకటించారు. ఈ బాటలో ఇతర కంపెనీల కొనుగోళ్లు, వ్యూహాల్లో మార్పులు తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు.
ఇన్పోసిస్ కొనుగోలు చేయనున్న కంపెనీ ఆదాయం 30-50 కోట్ల డాలర్ల మధ్య ఉండొచ్చునని తెలిపాయి. ఈ కొనుగోలు ఇన్ఫోసిస్ వృద్ధికి అత్యంత వ్యూహాత్మకంగా పనిచేయనుంది. కాగ్నిజెంట్ వంటి ప్రత్యర్థి కంపెనీలు పబ్లిక్ సర్వీసుల విభాగంలో పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ కొనుగోలు పూర్తయితే ఇన్ఫోసిస్ చరిత్రలోనే అతి పెద్ద కొనుగోలుగా నిలవనుంది. గతంలో మెక్కానిష్ వంటి కంపెనీలను సొంతం చేసుకున్నప్పటికీ అవన్నీ 50 కోట్ల డాలర్లలోపువే. ఇంతక్రితం యాక్సాన్ను కొనేందుకు ఇన్ఫోసిస్ భారీ స్థాయిలో బిడ్ వేసినప్పటికీ, చివరికి హెచ్సీఎల్ తన్నుకుపోయిన విషయం అందరికి తెలిసిందే.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications