మరో ముగ్గురు జగన్ వర్గం ఎమ్మెల్యేలు వెనక్కి

కడప, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఒక్కరేసి ఎమ్మెల్యే రాజీనామాల నుంచి వెనక్కి మళ్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత స్థితిలో తాము రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి సిద్ధంగా లేమని వారంటున్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని అంటున్నారు. ఆ ఎమ్మెల్యేకు వైయస్ జగన్ ఒత్తిడి కారణంగానే 2009 ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్ లభించింది. ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్ ఒత్తిడి పెంచితే మరింత మంది శాసనసభ్యులు వెనక్కి తగ్గవచ్చునని అంటున్నారు. కడప శాసనసభ్యుడు తాను ఏ పరిస్థితిలో రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్కు వివరించారని అంటున్నారు. ఈ వాదనతో రాజీనామాలను తిరస్కరించే అవకాశం స్పీకర్కు లభించిందని చెబుతున్నారు.
సిబిఐ ఎఫ్ఐఆర్లో చేర్చినందుకు నిరసనగా 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసిన వెంటనే జగన్ వర్గంలో విభేదాలు పొడసూపాయని అంటున్నారు. తమ రాజీనామాల వల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే స్థితి లేకపోవడంతో కొంత మంది తీవ్ర అసంతృప్తికి గురై, రాజీనామాలు సమర్పించినందుకు బాధపడ్డారని అంటున్నారు. ప్రభుత్వాన్ని కూల్చలేనప్పుడు రాజీనామాలు చేయడం అనవసరమని కూడా వాదించారని చెబుతారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications