సిబిఐ విచారణ: బళ్లారికి ఒఎంసి డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి

కాగా, గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి విచారణలో సిబిఐ అధికారులకు డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా అడిగితే ఆ సంతకం తనది కాదని, ఫోర్జరీ చేశారేమోనని గాలి జనార్దన్ రెడ్డి సమాధానం ఇస్తున్నారని సమాచారం. శ్రీనివాస రెడ్డి కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఏదైనా అడిగితే గుర్తు లేదని, గుర్తుకు వచ్చిన తర్వాత చెబుతానని అంటున్నారని తెలుస్తోంది. వారి తీరుతో సిబిఐ అధికారులు తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ముందే సిబిఐ అధికారులు ఆధారాలను సేకరించి పెట్టుకున్నారు. వాటి ఆధారంగా ప్రశ్నలు రూపొందించుకుని గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని విచారిస్తున్నారు. అయితే, వారిద్దరి నుంచి కూడా సరైన సమాధానాలు రావడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications