వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సమ్మెపై రేణుకా చౌదరి సెటైర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Renuka Choudary
న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితి నెలకొన్నప్పుడే తెలంగాణపై కేంద్రం ఆలోచిస్తుందని ఎపిఐఐసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి సోమవారం న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణలోని సకల జనుల సమ్మె విజయవంతమైందని అనుకోవడం భ్రమే అవుతుందన్నారు. రాష్ట్రంలో ఎనభై శాతం పనులు జరుగుతున్నాయన్నారు. సమ్మెలతో దేశాన్ని పంచమంటారా అని ఆమె తెలంగాణవాదులను ప్రశ్నించారు. సమ్మెలు చేసినంత మాత్రాన ఎగిరి గంతేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2014 సాధారణ ఎన్నికలలో పొత్తులు అవసరం ఉంటాయన్నారు.

ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తెలంగాణవాదులు సకల జనుల సమ్మెను విరమించుకోవాలన్నారు. లేదంటే ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. సిడబ్లుసిలో అత్యున్నత పదవులు అనుభవించిన వారు సైతం అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత సిబిఐ దర్యాఫ్తు మందగించిందనడం అవాస్తవమన్నారు. సిబిఐ దర్యాఫ్తు మందగించలేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి దీక్ష పైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సందించారు. మోడి తన బరువును తగ్గించుకోవడానికే సద్భావన దీక్ష చేపట్టారన్నారు. తాను కూడా తన బరువు తగ్గించుకోవడానికి దీక్ష చేయడంపై ఆలోచిస్తానన్నారు.

English summary
AICC spokes person Renuka Choudary said today that central government will think about Telangana when there law and orders is in government hand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X