జయసుధ సహా అందరూ జగన్ వెంటే: గుర్నాథ్ రెడ్డి

Jayasudha
హైదరాబాద్: సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు జయసుధ వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారని జగన్ వర్గం ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి మంగళవారం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు సిబిఐ ఎఫ్ఐఆర్‌లో ఉందని రాజీనామా చేసిన ఇరవయ్యారు మంది శాసనసభ్యులు జగన్ వెంటే ఉంటారన్నారు. ఎవరూ వెనక్కి తగ్గరన్నారు. జగన్ ఎదుగుదల చూసి ఓర్వలేకనే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి కొట్టి పారేశారు.

కాగా ఈ నెల 13వ తారీఖున పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ, భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతితో పాటు జయసుధ రాజీనామా చేయని విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని, రాజీనామాలు ఓ డ్రామాలాగా కనిపిస్తున్నాయని, రాజీనామాలు ఖచ్చితంగా ఆమోదిస్తారనే అభిప్రాయానికి వచ్చినప్పుడే తాను రాజీనామా చేస్తానని చెప్పి జగన్ వర్గానికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

కాగా అధికార కాంగ్రెసు ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని వైయస్సార్సీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దివంగత వైయస్ హయాంలో చేనేత కార్మికులకు ప్రాధాన్యమిచ్చారని కానీ ఇప్పటి ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వైయస్ హయాంలో చేనేతకు మూడువేల కోట్లు కేటాయిస్తే ఇప్పటి ప్రభుత్వం కేవలం 110 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+