కెసిఆర్‌కు మించిన కార్యాచరణ ఉంది: కేశవ రావు

K Keshava Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేపట్టే కన్నా మించిన పటిష్టమైన కార్యాచరణ తమ వద్ద ఉందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవ రావు అన్నారు. తమ కార్యాచరణకు అందరి మద్దతు అవసరం ఉంటుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇప్పుడు నిరవధిక నిరాహార దీక్ష అవసరం లేదని తాను కెసిఆర్‌కు చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటుంటే, సమ్మెనే లేదని తమ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారని, ఏది నిజమో వారిద్దరు మాట్లాడుకుని చెప్పాలని ఆయన అన్నారు.

అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే సంకేతాలు తమకు అందుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నదానికి ఆచరణలో జరుగుతున్నదానికి పొంతన లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల ఇబ్బందులపై అంత బాధ ఉంటే పరిస్థితి చేయి దాటిపోతోందని కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి చెప్పాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి మాటలకు రాష్ట్రంలో విలువ లేదని ఆయన అన్నారు. హాస్టళ్లలోకి వెళ్లి పోలీసులు విద్యార్థులను కొట్టడం తాను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+