ఎనిమిదో రోజు కొనసాగుతున్న తెలంగాణ సమ్మె
పోలీసు భద్రత మధ్య కొన్ని ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పుతున్నప్పటికీ ఎక్కువ శాతం డిపోలకే పరిమితమయ్యాయి. కరీంనగర్ తదితర జిల్లాల్లో ఆర్టీసి అధికారులు బస్సులు బయటకు తీసేందుకు చేసే ప్రయత్నాలను ఆర్టీసి జెఏసి అడ్డుకొంది. నిజాం కళాశాలలో సోమవారం విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ విద్యార్థులు మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ను అడ్డుకున్నారు. ప్రిన్సిపల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులపై పోలీసుల దాష్టీకానికి బాధ్యత వహిస్తూ ప్రిన్సిపల్ అశోక్ నాయుడు విద్యార్థులకు క్షమాపణ చెప్పి వారి సమక్షంలో రాజీనామా చేశారు. బాధిత విద్యార్థులను కోదండరాం పరామర్శించారు.
Comments
sakala janula strike telangana nizam college osmania university hyderabad సకల జనుల సమ్మె తెలంగాణ నిజాం కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్
English summary
Sakala Janula Strike is continuing on eigth day today in Telangana region.
Story first published: Tuesday, September 20, 2011, 11:16 [IST]